HomeTelugu Trending'సమ్మోహనం' నటుడు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుధీర్‌బాబు

‘సమ్మోహనం’ నటుడు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుధీర్‌బాబు

11 7‘సమ్మోహనం’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు అమిత్‌ పురోహిత్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని సుధీర్‌బాబు ట్విటర్‌ వేదికగా తెలుపుతూ.. దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘అమిత్‌ పురోహిత్‌ మరణం నన్నెంతో బాధించింది. ‘సమ్మోహనం’ సినిమాలో సమీరా మాజీ ప్రియుడిగా నటించిన అతడు చాలా స్నేహంగా ఉండేవారు. ప్రతి షాట్‌కు 100 శాతం న్యాయం చేసేవాడు. నైపుణ్యం ఉన్న ఓ మంచి యువ నటుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు. అతడి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని పోస్ట్‌ చేశారు. అమిత్‌ మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది.

అమిత్‌ మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దీన్ని నమ్మలేకపోతున్నా. నేను కలిసి పనిచేసిన వారిలో అమిత్‌ పురోహిత్‌ ఎంతో వినయం, నిబద్ధత, నైపుణ్యం కలిగిన నటుడు. అమిత్‌.. నేను నిన్ను మిస్‌ అవుతున్నా. నిన్ను నా తర్వాతి సినిమాకు తీసుకోవాలి అనుకున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

అమిత్‌ హిందీలో ‘పంక్’ (2010), ‘ఆలాప్‌’ (2012) తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో 2018లో వచ్చిన ‘సమ్మోహనం చిత్రంలో కథానాయిక అదితిరావు హైదరి (సమీరా-పాత్ర పేరు) మాజీ ప్రియుడిగా నటించారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!