HomeTelugu Trendingసాయిధరమ్‌ తేజ్‌ 15 సినిమా ప్రారంభం.. హీరో ఎమోషనల్

సాయిధరమ్‌ తేజ్‌ 15 సినిమా ప్రారంభం.. హీరో ఎమోషనల్

Sai dharam tej emotional on
సాయిధరమ్‌ తేజ్‌15వ సినిమా ప్రారంభమైంది. ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగానే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత తాజాగా సెట్స్ లోకి వచ్చాడు. ‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకొని తన తదుపరి చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు.

షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సెట్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ సాయి ధరమ్ తేజ్ కి ఘనం స్వాగతం పలికారు. ఇక చాలా రోజుల తరువాత షూటింగ్ కు వెళ్లడం, పైగా అక్కడ అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తేజ్ ఎమోషనల్ అయ్యారు. సినిమా లాంచ్ కి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదలచేయగా, ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

కన్యాకుమారిలో హీరో సూర్య-డైరెక్టర్‌ బాల

Recent Articles English

Gallery

Recent Articles Telugu