టాలీవుడ్లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్ఇచన కోలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి. ప్రస్తుతం విరాటపర్వం, లవ్ స్టోరీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ఈ భామ హామిళంలోను అటు మలయాళం లోను సినిమాలు చేస్తుంది. అయితే ఈ మధ్య అమ్మడికి తమిళనాట నుంచి ఆఫర్లు రావడంలేదని వినిపిస్తుంది. ఈ అమ్మడు గతంలో ధనుష్ సరసన మారి 2, సూర్య సరసన ఎన్జీకే సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. తాజాగా ఈ బ్యూటీకి మెగాఆఫర్ వచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ ‘వేదలమ్ ‘ను రీమేక్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి మెహర్ రమేష్ దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ఆచార్య పూర్తి అవ్వడమే ఆలస్యం రీమేక్ ను షురూ చేయాలని భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో సాయి పల్లవిని హీరోయిన్ పాత్రకు గాను సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా సాయిపల్లవిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట మూవీయూనిట్. ‘వేదలమ్’ సినిమాలో అజిత్ చెల్లి క్యారెక్టర్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. దాంతో ఈ పాత్రకోసం సాయిపల్లవిని అనుకుంటున్నారట. మరి ఈ ఆఫర్ సాయిపల్లవి ఒకే చేస్తుందో లేదో చూడాలి. ఎంతైనా ఫిదా బ్యూటీకి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి . చూడాలి మరి ఏంజరుగుతుందో.