HomeTelugu Trendingనన్ను అలా పిలవొద్దు.. యాంకర్‌కు సాయిపల్లవి వార్నింగ్

నన్ను అలా పిలవొద్దు.. యాంకర్‌కు సాయిపల్లవి వార్నింగ్

6 26
టాలీవుడ్‌లో ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి. తర్వాత నానితో ‘ఎంసీఏ’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎన్జీకె’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సాయి పల్లవి స్వీడ్‌ కాస్త తగ్గింది. కాగా ఆమె మొదట పలు తమిళ సినిమాల్లో నటించింది. నిజానికి సాయి పల్లవి తమిళమ్మాయి. అయితే మలయాళ ‘ప్రేమమ్’ సినిమా ఈమెకు బ్రేక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నసాయి పల్లవిని యాంకర్ ‘మలయాళీ’ అని పిలవడంతో కోపం వచ్చిందట ‘అసలు నేను మలయాళీని కాను.. నేను తమిళమ్మాయిని.. కోయంబత్తూర్ లోనే పెరిగాను. నన్ను ఇంకెప్పుడు మలయాళీ అని మాత్రం పిలవకండి’ అంటూ సమాధానం ఇచ్చిందట సాయి పల్లవి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!