హీరోయిన్ సాయి పల్లవి చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆమెకున్న అభిమానులు ఎక్కువ. ప్రస్తుతం సాయి పల్లవి పలు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా.. ఓ డబ్బింగ్ చిత్రంతో త్వరలోనే విడుదలకాబోతుంది. తెలుగు ప్రేక్షకుల కోసం మలయాళ సూపర్హిట్ చిత్రం అథిరన్ ను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం కాగా ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇంకా తెలుగు టైటిల్ ప్రకటించని ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలో విడుదల చేయబోతున్నారు.