HomeTelugu Trendingవిజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై మండిపడ్డ సమంత?

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై మండిపడ్డ సమంత?

Samantha latest post viral
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రతిరోజూ ఏదో హాట్ టాపిక్‌తో వార్తల్లో ఉంటోంది. ఇటీవల బాలీ టూర్‌కు వెళ్లిన సమంత అక్కడి నుంచి షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

విజయ్ దేవరకొండతో కలిసి నటించిన సమంత చిత్రం ఖుషి విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో చిత్రబృందం బిజీగా ఉంది. దీనికి సమంత దూరంగా ఉంటోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లోనూ పాల్గొనలేదు. అందుకే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు.

దీనిపై పరోక్షంగా సోషల్ మీడియాలో సమంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ లోకం కోసం మీరు బతకాల్సిన అవసరం లేదు.. మీరు మీ కోసం బతకండి.. అంటూ సమంత మండిపడుతోంది. ఈ సమాజం మిమ్మల్ని గుర్తించకపోవచ్చని, మీ గౌరవం ఏమిటో తెలుసుకుని, మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయాలని అంటోంది.

పది మందిలో ఒకరిలా కాకుండా ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో బతికేందుకు ప్రయత్నించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమంత ఈ కామెంట్స్ ఎవరి గురించి చేసిందో మాత్రం చెప్పలేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu