HomeTelugu Trendingవైశాలి ట్రయో రిపీట్‌ 'శబ్దం' అప్డేట్‌

వైశాలి ట్రయో రిపీట్‌ ‘శబ్దం’ అప్డేట్‌

Shabdam movie Update

కోలీవుడ్ డైరెక్టర్‌ అరివళగన్, న‌టుడు ఆది పినిశెట్టి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఈరం (తెలుగులో ‘వైశాలి’). 2009లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఇక ఈ సినిమాతోనే థ‌మ‌న్‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు ల‌భించింది. అయితే దాదాపు 14 ఏండ్ల త‌రువాత ఈ ట్ర‌యో మ‌ళ్లీ రిపీట్ అవుతుంది.

తాజాగా వీరికాంబోలో వ‌స్తున్న చిత్రం ‘శబ్దం’. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మీమీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండ‌గా.. ఈ మూవీతోనే అరివళగన్‌ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ క్ర‌మంలోనే మూవీ నుంచి చిత్ర‌యూనిట్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను డిసెంబ‌ర్ 14న సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇక అరివళగన్‌ ఆల్ఫా ఫ్రేమ్స్‌, 7జీ ఫిలింస్‌ శివ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ‌రోవైపు.. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి లైలా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!