
‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాలో హీరో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు సిద్ధార్థ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్లుక్లో సిద్ధార్థ్ సాధారణ యువకుడిలా కనిపిస్తున్నాడు. ఇక సిద్ధార్థ్ చాలాకాలం తరువాత నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే. ఈ చిత్రం నుంచి ఇటీవలే శర్వానంద్, అదితి రావు హైదరిల ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి. ఆగష్టు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













