HomeTelugu Trendingరామమందిర ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం రాలేదు: లక్ష్మణుడు

రామమందిర ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం రాలేదు: లక్ష్మణుడు

sunil lahri disappointed ov
రామానంద్ సాగర్ డైరెక్షన్‌లో 1987-88లో వచ్చిన సీరియల్‌ ‘రామాయణ్.’ అప్పట్లో దూర్‌ద‌ర్శ‌న్‌లో ప్రతి ఆదివారం ఈ సీరియ‌ల్ ప్రసారమయ్యేది. అపట్లో ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ సీరియల్‌లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపిక చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లాహ్రీ నటించారు.

అయితే, అయోధ్యలో వచ్చే ఏడాది శ్రీరామ మందిర ప్రారంభోత్స‌వం నిర్వహించనున్న విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌కు తనకు ఆహ్వానం అందలేదని లక్ష్మణుడిగా న‌టించిన‌ సునీల్ లాహ్రీ తాజాగా పేర్కొన్నారు. రాముడిగా, సీతగా చేసిన అరుణ్ గోవిల్, దీపికకు ఆహ్వానపత్రికలు అందినా తనకు మాత్రం పిలుపు రాకపోవడం కాస్తంత నిరాశ కలిగించిందన్నారు.

రామాయణ్‌లో తన క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యం లేదని ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వాహకులు భావించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తనతో వారికి వ్యక్తిగతంగా ఏదైనా ఇష్యూ ఉండొచ్చని కూడా చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతిఒక్కరికీ ఆహ్వానం అందాలన్న నియమం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే, చారిత్రాత్మక క్షణాల్లో తనకూ భాగమయ్యే అవకాశం లభించి ఉంటే సంతోషించే వాడినని సునీల్ లాహ్రీ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu