HomeTelugu Trending'మర్డర్‌' సినిమాపై రామ్‌ గోపాల్‌ వర్మపై కేసు..

‘మర్డర్‌’ సినిమాపై రామ్‌ గోపాల్‌ వర్మపై కేసు..

4 2

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే మిర్యాలగూడ పరువు హత్యపై సినిమా తీస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణయ్ అమృత ప్రేమకథ.. అమృత తండ్రి మారుతీరావు కక్షతో అల్లుడు ప్రణయ్ ని చంపించడం నేపథ్యంలో ‘మర్డర్’ సినిమా ప్రకటనను చేశాడు. ఈ సినిమాపై ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. నల్లగొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు తాజాగా మిర్యాలగూడ పోలీసులను రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమా నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

దళితుడైన యువకుడు ప్రణయ్ ని తన కూతురు అమృత ప్రేమ పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో హత్య చేయించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఆ తరువాత జైలు శిక్ష అనుభవించిన మారుతీరావు.. విచారణలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu