HomeTelugu Newsఅలీని పరామర్శించిన మంత్రి తలసాని

అలీని పరామర్శించిన మంత్రి తలసాని

11 18
నటుడు అలీని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల అలీ మాతృమూర్తి జైతున్‌ బీబీ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మణికొండలోని అలీ నివాసానికి మంత్రి వెళ్లారు. ఆయన్ను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలీ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తోపాటు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, పలువురు సినీ నటులు అలీని పరామర్శించిన వారిలో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu