HomeTelugu Trendingకరోనాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మృతి

కరోనాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ మృతి

Tollywood cinematographer j
టాలీవుడ్‌లో కరోనా మహమ్మారికి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. సాధారణ కథను సైతం తన కెమెరాతో అందంగా, అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ వి.జయరామ్‌ కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా, చికిత్స పొందుతూనే గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, మలయాళ చిత్రాలకు ఆయన ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తెలుగులో స్టార్‌ హీరోలు నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘పెళ్లి సందడి’ తో సహా అనేక చిత్రాలు ఆయన కె.సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu