HomeTelugu Trendingటాలీవుడ్‌లో మరో విషాదం

టాలీవుడ్‌లో మరో విషాదం

Tollywood producer PDV pras
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత పీడీవీ ప్ర‌సాద్ స‌తీమ‌ణి అంజు ప్ర‌సాద్(53) గుండెపోటుతో మ‌ర‌ణించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. పీడీవీ ప్ర‌సాద్ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. కాగా పీడీవీ ప్ర‌సాద్.. ప్ర‌ముఖ‌ చ‌ల‌న‌చిత్ర‌ నిర్మాణ సంస్థ‌లు హారిక హాసిని నిర్మించే చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంజు ప్ర‌సాద్ మృతి ప‌ట్ల‌ ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌లు నివాళులు అర్పిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!