HomeTelugu Trendingచిరంజీవి ఇంట్లో టాలీవుడ్‌ ప్రముఖుల భేటీ

చిరంజీవి ఇంట్లో టాలీవుడ్‌ ప్రముఖుల భేటీ

Tollywood top celebrities m

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్‌ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై పరిశ్రమ పెద్దలతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం తో ఏం మాట్లాడాలి, ఏ అంశాలు ప్రస్తావించాలి అనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు, దిల్‌రాజు, వి.వి.వినాయక్‌, కొరటాల శివ, మెహర్‌ రమేశ్‌, ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన కొత్త జీవో విషయంలో దర్శకనిర్మాతలు విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ జీవో అమలును పునరాలోచించడంతో పాటు టికెట్‌ ధరలు, ఇతర సమస్యలను భేటీ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించనున్నారు. కరోనా వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఇండస్ట్రీని ఆదుకోవాలని కోరడంతో పాటు రాయితీలు కల్పించాలని కోరే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu