‘నీమనసు నాకు తెలుసు’ తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది త్రిష కృష్ణన్. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా ‘వర్షం’, ‘నువ్వస్తానంటే నేనోదంటానా’,
‘అతడు’ లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. కాగ చిరంజీవి, త్రిష ఇంతకు ముందు ‘స్టాలిన్’లో నటించారు. చాలా రోజుల నుండి ఓ మంచి సినిమాతో టాలీవుడ్లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.