HomeTelugu Newsభారత్‌లో ఇద్దరిని మింగేసిన కరోనా మహమ్మారి

భారత్‌లో ఇద్దరిని మింగేసిన కరోనా మహమ్మారి

9 12

భారత్‌లో కరోనా వైరస్‌ కారణంగా ఇద్దరు మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ స్థానిక ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వెల్లడించింది. కరోనాతో మృతిచెందిన మహిళ కుమారుడు విదేశాల్లో పర్యటించి గత నెలలో భారత్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిద్దరికీ పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలున్నట్టు తేలింది. ఈ నెల 7 నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వీరిద్దరిలో మహిళకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఇవాళ ఆమె మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే కర్నాటకకు చెందిన వృద్ధుడు కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 మందికి పైగా కరోనా బారినపడినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీలో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఐపీఎల్ మ్యాచులు సైతం వాయిదా పడ్డాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu