HomeTelugu Big Storiesఈ ఏడాది మిస్‌ ఇండియా అనుకీర్తి

ఈ ఏడాది మిస్‌ ఇండియా అనుకీర్తి

ఈ ఏడాది మిస్‌ ఇండియాగా తమిళనాడుకు చెందిన 19 సంవత్సరాల కాలేజి స్టూడెంట్‌ అనుకీర్తి వాస్‌ ఎంపికైంది. ముంబైలో చిత్ర నిర్మాణ కరణ్‌ జోహార్‌, నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ముఖ్య అతిథులుగా హాజరైన మిస్‌ ఇండియా ఫైనల్స్‌ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా, సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చిన అనుకీర్తి అందాల సుందరి కిరిటాన్ని అందుకున్నారు.

anukreethy vas

30 మంది ఫైనలిస్టులతో పోటీపడి అనుకీర్తి విజయం సొంతం చేసుకుంది. హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి రెండో స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన కామవరపు శ్రేయారాపు మూడో స్థానంలో నిలిచారు. న్యాయ మూర్తల ప్యానల్‌ లో ఇండియన్‌ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, కే ఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ సెలబ్రెటీలు మలైకా అరోరా, బాబీ డియోల్‌, కునాల్‌ కపూర్‌ లు ఉన్నారు.

ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో మాధురీ దీక్షిత్‌, కరీనా కపూర్‌, జాక్వలిన్‌ ఫెర్నాండ్‌జ్‌ల నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. విజయం సాధించిన అనుకీర్తికి, గత సంవత్సరం విజేత మానుషీ చిల్లర్‌ కిరీటాన్ని అలంకరించగా, ఇక మిస్‌ వరల్డ్‌ 2018పోటీల పై దృష్టిని పెడతానని విజయం సాధించిన అనుకీర్తి మీడియాకు తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu