HomeTelugu Newsకరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త: చంద్ర బాబు నాయుడు

కరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త: చంద్ర బాబు నాయుడు

గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. సభికులతో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడును అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కరుణానిధి సేవలు అసమానమని కీర్తించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

5 6

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణానిధి రాటుదేలిన రాజకీయ వేత్త. కోట్ల మందిని ప్రభావితం చేసిన విలక్షణ నాయకుడు. తమిళనాడులో తిరుగులేని నేత. దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగారు. రాజకీయ రంగంలోనే కాకుండా కళా రంగంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారు. కరుణానిధితో నాకు మంచి అనుభవం ఉంది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పుడు కరుణానిధి అండగా నిలిచారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఏర్పాటుచేసుకున్న కరుణానిధి చనిపోవడం తమిళనాడుతో పాటు దేశానికి తీరని లోటు’ అని ప్రశంగించారు చంద్రబాబు నాయుడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu