HomeTelugu Big Storiesతెలంగాణలో కరోనా ప్రకంపనలు..ఒకేరోజు 75 కేసులు

తెలంగాణలో కరోనా ప్రకంపనలు..ఒకేరోజు 75 కేసులు

11 1
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. ఇవాళ కరోనా వైరస్ బాధితుల్లో ఇద్దరు చనిపోయారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 11కి చేరింది. కరోనా బారినుంచి ఇప్పటి వరకు 32 మంది కోలుకున్నారు. ప్రస్తుతానికి యాక్టివ్‌గా ఉన్న కేసులు 186. హైదరాబాద్‌లోని గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కరోనా ప్రకంపనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 900 మందిని ప్రభుత్వం గుర్తించింది. రెండు రోజుల్లో 800 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో 130 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఏ ప్రాంతాల్లో తిరిగారు..? ఎంతమందిని కలిశారు..? అనే అంశాలపై స్వయంగా విచారణ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu