HomeTelugu Big Storiesవాళ్లిద్దరు నావాళ్లే...ఇదొక చరిత్ర : ఐశ్వర్య

వాళ్లిద్దరు నావాళ్లే…ఇదొక చరిత్ర : ఐశ్వర్య

aishwarya tweet on rajinika67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తలైవా రజనీకాంత్‌ , హీరో ధనుష్‌లు కొత్త చరిత్రను సృష్టించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్‌ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డును అందుకున్నారు.

దీంతో రజనీకాంత్‌ కుమార్తె, ధనుష్‌ భార్య ఐశ్వర్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్‌ చేసు కుంటోంది. ‘వాళ్లిద్దరు నావాళ్లే. ఇదొక చరిత్ర’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా భార్యగా, కుమార్తెగా గర్వపడుతున్నానంటూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి సినీ ప్రేమికులంతా కూడా ఈ అరుదైన సందర్భాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అటు ధనుష్‌ కూడా తాజా పురస్కారాలపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని వర్ణించలేనంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu