అక్కినేని హీరో సుమంత్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘కపటధారి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ను మూవీయూనిట్ విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే.. మర్డర్ మిస్టరీగా ఏ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాజర్, నందిత శ్వేత, పూజా కుమార్, వెన్నెల కిషోర్, జయప్రకాశ్ తదితరులు నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు.