HomeTelugu Trendingమరోసారి భారీ విరాళం ఇచ్చిన అక్షయ్‌ కుమార్‌

మరోసారి భారీ విరాళం ఇచ్చిన అక్షయ్‌ కుమార్‌

11 8
కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆరికట్టడానికి.. దాని నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలకు నిధులు చాలా అవసరం. అందుకే, ఈ నిధులను సేకరించడంలో దేశ ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఎవరికి తోచినంత చిన్న మొత్తమైనా విరాళంగా ఇవ్వొచ్చని ప్రధాని పేర్కొన్న విషయం తెలిసిందే. దాంతో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించి తాను దాచుకున్న మొత్తంలో నుంచి 25 కోట్ల రూపాయలను పీఎం ఫండ్ కు విరాళంగా అందించారు. అక్షయ్ ఆ రేంజ్ లో ఇవ్వడంపై అతడి భార్య ట్వింకిల్ ఖన్నా కూడా అసహనం వ్యక్తం చేసింది. అంతా మొత్తం ఇస్తే కుటుంబానికి ఎలా? అన్నది ఆమె ఆవేదన. అయినా అక్షయ్ మరోసారి పెద్ద మనసుని చాటుకొన్నారు. మరోసారి విరాళం అందజేశారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu