
Akshay Kumar Mumbai apartment:
బాలీవుడ్ స్టార్ హీరో Akshay Kumar తన బోరివాలి ఈస్ట్లో ఉన్న ఓ భవంతిని భారీ ధరకు అమ్మిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ముంబైలోని ఓబెరాయ్ స్కై సిటీలో ఈ ప్లాట్ ఉంది. 1,073 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో, రెండు కారు పార్కింగ్ స్థలాలతో కూడిన ఈ అపార్ట్మెంట్ను అక్షయ్ 2017లో ₹2.38 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ₹4.25 కోట్లకు విక్రయించి రియల్ ఎస్టేట్ రంగంలో భారీ లాభం పొందారు.
ముంబైలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చెందుతున్నట్లు ఈ డీల్ స్పష్టంగా చూపిస్తోంది. ఈ స్థిరాస్తి వ్యాపారం ద్వారా అక్షయ్ తన పెట్టుబడులను స్మార్ట్గా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు.
అక్షయ్ కుమార్ బాలీవుడ్లో అత్యధిక పారితోషికం పొందుతున్న నటుల్లో ఒకరు. ఒక సినిమా కోసం సుమారు ₹150 కోట్లు ఛార్జ్ చేస్తూ, టాప్ స్టార్గా కొనసాగుతున్నారు. ఈ మధ్యే ఆయన నటించిన ‘స్కై ఫోర్స్’ సినిమా థియేటర్లలో విడుదలైంది. అక్షయ్కు ఉన్న అభిమానుల సంఖ్య, సినిమా విజయాలు ఆయన రేంజ్ను మరో స్థాయిలోకి తీసుకెళ్లాయి.
సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ అక్షయ్ పెద్ద స్థాయిలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఆయనకు అదనపు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ముంబై లాంటి మేట్రో నగరాల్లో స్థిరాస్తి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి వ్యాపారాలు భవిష్యత్లో మరింత లాభాలను తెస్తాయని భావిస్తున్నారు.
ALSO READ: టోవినో థామస్, త్రిషా నటించిన Identity OTT స్ట్రీమింగ్కు సిద్ధం!