HomeTelugu Trendingత‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజకు మాతృ వియోగం

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజకు మాతృ వియోగం

9 5

ప్రముఖ ద‌ర్శకుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తల్లి కృష్ణవేణి ఈరోజు మృతి చెందారు. ఆమె వయసు ప్రస్తుతం 94 సంవత్సరాలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇక త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణమూర్తి చిత్ర నిర్మాతన్న సంగతి తెలిసిందే. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ బ్యానర్ మీద ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా గతంలోనే కాలం చేశారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శకుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాలున్న కుటుంబమే. ఇక తన తల్లి మరణం గురించి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్దని ఆయ‌న కోరారు.

ఈ వార్త తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ఆయనను ఫోన్‌లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సేవలదించారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu