HomeTelugu Trendingనాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయు విద్యార్థులు

నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయు విద్యార్థులు

4 19టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నరియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-3’. బిగ్‌బాస్‌ షోను నిలిపి వేయాలంటూ, నాగార్జున డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ ఓయూ విద్యార్థులు నిరసనకు దిగారు. నాగార్జున ఇంటిని ముట్టడించారు. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో ఓయూ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు.

4a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu