HomeTelugu Trendingనీరజ్‌ చోప్రాపై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు

నీరజ్‌ చోప్రాపై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు

Celebrities praise on neera

టోక్యో ఒలింపిక్స్‌లో భారత తరఫున అధ్లెట్స్ విభాగంలో నీరజ్ చోప్రా తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్. ఎస్. రాజమౌళి, మంచు విష్ణు, నాగశౌర్య, స్మిత, ప్రవీణ్ సత్తారు, దుల్కర్ సల్మాన్, ఆర్య తదితరులు నీరజ్ చోప్రాను సోషల్ మీడియా ద్వారా అభినందనలతో ముంచెత్తారు. అలానే రెజ్లింగ్ లో కాంస్య పతకాన్ని అందుకున్న భజరంగ్ పునియాను నందమూరి బాలకృష్ణ, కమల్ హాసన్, టోవినో థామస్, ఐశ్వర్యా రాజేశ్‌ తదితరులు అభినందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu