HomeTelugu Trendingరాజ్‌కుమార్‌ మృతి తీరని లోటు: మెగాస్టార్‌ చిరంజీవి

రాజ్‌కుమార్‌ మృతి తీరని లోటు: మెగాస్టార్‌ చిరంజీవి

12 12
మెగాస్టార్‌ చిరంజీవి ‘పునాది రాళ్లు’ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ మృతి తీరని లోటు అని అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుడిపాటి రాజ్‌కుమార్‌ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్‌ మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియచేస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘ఫిల్మ్‌ ఇస్టిట్యూట్‌లో నేను శిక్షణ తీసుకుంటున్న సమయంలో రాజ్‌కుమార్‌ నన్ను కలిసి ‘పునాదిరాళ్లు’ సినిమాలో నటించమని కోరారు. శిక్షణ పూర్తికాకుండా నటించడం ఎలా అని అడిగినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఆయన బలవంతం మీద ఆ సినిమాలో నటించాను. అదే నా నట జీవితానికి ‘పునాదిరాళ్లు’ వేసింది. ఇటీవల కొంతకాలం క్రితం ఆయన మా ఇంటికి వచ్చి నన్ను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. త్వరలో పూర్తి
ఆరోగ్యంతో నన్ను కలవడానికి వస్తారనుకున్నాను. ఆయన మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని
చిరంజీవి అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu