HomeTelugu Newsమెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ అమితాబ్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ అమితాబ్ ప్రశంసలు

15 5

టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్‌ చొరవతో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులంతా కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌కు తెలిసి అభినందించారని చిరంజీవి చెప్పారు. సీసీసీకి చిరంజీవి అధ్యక్షత వహిస్తుండగా తమ్మారెడ్డి భరద్వాజ, సురేశ్‌బాబు, కల్యాణ్‌, దాము, శంకర్‌, బెనర్జీ, మెహర్‌ రమేశ్‌ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు సీసీసీకి విరాళాలు ఇచ్చారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా తాజాగా ఒకేసారి వెయ్యి మంది కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి మీడియాకు తెలిపారు. ‘ఒకే రోజు వెయ్యి మందికి సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంత పెద్ద పని చేయాలంటే ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు రావాలి అన్నారు. బాధ్యతగా, ధర్మంగా కార్మికులకు సాయం చేయడాన్ని పరిశ్రమలోని వారు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అమితాబ్ బచ్చన్‌ గారు ఈ పంపిణీ విధానం తెలుసుకొని తనకు ఫోన్ చేసి అందరినీ అభినందించినట్టు చిరంజీవి తెలిపారు. దీన్ని ముందుండి నడిపిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్‌, మెహర్ రమేష్‌కి నా ప్రత్యేక అభినందనలు’ అని చిరంజీవి తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!