HomeTelugu News'సీసీసీ'కి సాయికుమార్‌ విరాళం..

‘సీసీసీ’కి సాయికుమార్‌ విరాళం..

6 7
కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి అన్ని ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని కూడా 21 రోజులు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వలన ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి హీరోలు అందరూ విరాళాలు అందిస్తున్నారు. తాజాగా డైలాగ్ కింగ్ సాయికుమార్ ఆయన కుమారుడు హీరో ఆది సాయి కుమార్ కరోనా క్రైసిస్ఛారిటీకి 4 లక్షల రూపాయలను విరాళం గా అందించారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు కూడా సాయి కుమార్ తన వంతుగా రూ.1 లక్ష 8 రూపాయలను విరాళంగా అందించారు. ఆయన సోదరుడు రవిశంకర్ ఒక లక్ష రూపాయలు డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు విరాళంగా అందజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu