కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ హడలెత్తిస్తోంది. తాజాగా ప్రముఖ యాంకర్, దర్శకుడు ఓంకార్ కు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ జోడి షోకు సంబంధించిన షూటింగ్లో ఓంకార్ పాల్గొన్నారు. ఈ విషయం తెలీకుండానే షూటింగ్ లో పాల్గొన్నాడట. విషయం తెలిసాక షూటింగ్కు రావడం లేదని షో నిర్వాహకులు ఆరా తీస్తే ఓంకార్ కు కరోనా పాజిటివ్ అనే విషయం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ షో షూటింగ్ లో పాల్గొన్న మిగతా సభ్యులకూ కరోనా టెన్షన్ పట్టుకుంది.