HomeTelugu Trendingమళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ మిస్ ఇండియా

మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ మిస్ ఇండియా

9 13

నటి, మాజీ మిస్‌ ఇండియా పూజా బాత్రా తన చిరకాల స్నేహితుడు, నటుడు నవాబ్‌ షాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. కొన్నిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట గత వారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల మధ్య ఢిల్లీలో తమ వివాహం జరిగిందని తెలిపారు. నవాబ్‌ షా భాగ్‌మిల్కాభాగ్‌, లక్ష్యా తదితర చిత్రాలలో నటించాడు. 1993లో మిస్‌ ఇండియాగా ఎంపికైన పూజా బాత్రా 2011లోనే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు.

నవాబ్‌ షాను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే, తనకు జీవితాంతం తోడుగా ఉండగలడని నమ్మకం కుదిరిన తర్వాతే వివాహ బంధంలో అడుగుపెట్టాలనుకున్నట్లు పూజాభత్రా తెలిపారు. మేము పెళ్లి చేసుకున్నాం. ఢిల్లీలో నేను, నవాబ్‌ పెళ్లి ప్రమాణాలు చేశాం. ఇరు కుటుంబాల సన్నిహితుల ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌లో నిరాడంబరంగా మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నాం అని ఓ ఇంటర్వ్యూలో పూజ తెలిపారు. పూజా బాత్రా తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

9a

Recent Articles English

Gallery

Recent Articles Telugu