HomeTelugu Newsకోవిడ్ వారియర్స్ పై పూలవర్షం

కోవిడ్ వారియర్స్ పై పూలవర్షం

2 2
భారత్‌లో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. కరోనా వైరస్ పై వైద్యులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వైద్యులకు, నర్సులకు, పోలీసులకు ఇప్పటికే ప్రజలు వివిధ రూపాల్లో సంఘీభావం తెలిపారు.

కాగా, ఈరోజు త్రివిధ దళాలు కోవిడ్ వారియర్స్ కు పూలవర్షం కురిపించి సంఘీభావం తెలియజేశాయి. గాంధీ హాస్పిటల్ సిబ్బందిపై కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూలవర్షం కురిపించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు ముందుగా గాంధీ హాస్పిటల్ కు చేరుకొని అక్కడి వైద్యులకు, పోలీసులకు పుష్పగుచ్ఛం ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఆ తరువాత చేతక్ హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu