HomeTelugu Newsమోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీస్టారర్ చిత్రం!

మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీస్టారర్ చిత్రం!

“జెంటిల్ మెన్”తో సూపర్ హిట్ అందుకొన్న తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి మరో డిఫరెంట్ జోనర్ లో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధమయ్యారు. స్క్రూ బాల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా నటిస్తుండగా.. “ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్” పతాకంపై కె.సి.నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
ఈ సందర్భంగా “ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్” సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్న చిత్రంతో నిర్మాతగా మారుతుండడం సంతోషంగా ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మా చిత్రానికి సంగీత సారధ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది” అన్నారు. 
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవిందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహా రావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!                                                                        

Recent Articles English

Gallery

Recent Articles Telugu