HomeTelugu Trendingజీవిత, రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

Jeevitha and Rajasekhar

ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. పరువునష్టం కేసులో వీరికి శిక్ష వేసింది నాంపల్లి కోర్టు.

చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

చిరంజీవి పేరుతో నడిచే సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా అసత్య ఆరోపణలు చేశారంటూ జీవిత, రాజశేఖర్ దంపతులపై పరువునష్టం దావా వేశారు. వారి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు.

సుదీర్ఘ విచారణ అనంతరం నిన్న కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. అయితే, జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ బెయిలు మంజూరు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu