HomeTelugu Newsఅఖిల్‌ 'మజ్ను'కి ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌..!

అఖిల్‌ ‘మజ్ను’కి ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌..!

7 13
అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన మూవీ ‘మిస్టర్‌ మజ్ను’. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను శనివారం ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు. వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ రాబోతున్నారు. ఈ విషయాన్ని అఖిల్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘త్వరలో మిమ్మల్ని కలుస్తాం. మాకు సపోర్ట్‌ చేస్తున్నందుకు తారక్‌ అన్నకు ధన్యవాదాలు. నీతో కలిసి స్టేజ్‌ పంచుకోవాలని నాకెంతో ఆతృతగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జనవరి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu