HomeTelugu Trending'మిస్ ఇండియా' డబ్బింగ్ మొదలు పెట్టిన.. కీర్తి సురేష్

‘మిస్ ఇండియా’ డబ్బింగ్ మొదలు పెట్టిన.. కీర్తి సురేష్

4 1
దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌ల్లో కీర్తి సురేష్ ఒకరుగా రాణిస్తున్నారు. ‘మహానటి’తో సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ పురస్కారం కూడ లభించింది. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు టాలీవుడ్‌కు పరిచయమైన కీర్తి, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘మహానటి’కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న కీర్తి, ఆ తర్వాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత కథల ఎంపికలో ఆమె ఆచి తూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగా కీర్తి ప్రస్తుతం ‘మిస్ ఇండియా’లో నటిస్తోంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ గతంలో ఎన్నడూ చేయని ఓ ప్రత్యేక పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. కాగా మిస్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీంతో సినిమాకు సంబందించి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని నిర్మాత మహేష్ కోనేరు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మిస్ ఇండియా చిత్రానికి దర్శకుడు నరేంద్ర నాధ్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ.. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు కీర్తి ఓ స్పోర్స్ డ్రామాలో కూడా నటిస్తోంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కీర్తి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ లుక్‌లో కీర్తి సన్నగా మారి స్టైలీష్‌ లుక్‌లో అదరగొట్టింది. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ పెంగ్విన్, గుడ్ లక్ సఖి, తెలుగులో నితిన్‌తో రంగ్‌దే సినిమాల్లో నటిస్తుంది. అటు తమిళంలో కూడా కీర్తి అదరగొడుతోంది. సురేష్ రజనీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో కీర్తి సురేష్‌ కీలక పాత్ర నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu