మలయాళం నుంచి టాలీవుడ్ కు వచ్చిన కీర్తి సురేష్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర చేసింది కీర్తి సురేష్. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది. టాలీవుడ్ నుంచి ఏకంగా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది.
టాలీవుడ్ లో కాస్త బొద్దుగా ఉన్నా పర్వాలేదు. బాలీవుడ్ లో అలాకాదు. నాజూగ్గా ఉండాలి. జీరో ప్యాక్ సైజ్ తో అలరించాలి. అప్పుడే అక్కడి జనాలకు నచ్చుతుంది. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఏం చేస్తుంది పాపం… జిమ్ కు వెళ్లి కసరత్తులు చేసింది. గుర్తుపట్టని విధంగా మారిపోయింది. సన్నగా మెరుపు తీగలా మారింది మహానటి కీర్తి సురేష్.