HomeTelugu Newsఓటీటీలోకి 'మా ఊరి పోలిమేర-2'

ఓటీటీలోకి ‘మా ఊరి పోలిమేర-2’

maa oori polimera 2 ott rel

టాలీవుడ్ క‌మెడియ‌న్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. అనీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలాదిత్య మరో కీలక పాత్రలో నటించాడు. ఇక నవంబర్ 3వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లు సాధించింది.

తొలిరోజే రూ. 3 కోట్ల కలెక్షన్‌లు రాబ‌ట్టిన ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక థియేటర్‌లో అల‌రించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లో విడుదల కానుంది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ దిగ్గ‌జం ఆహాలో ఈ సినిమా డిసెంబ‌ర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవివర్మ, చిత్రమ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై గౌరీ కృష్ణ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండియర్‌గా రూపొందించాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu