తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పై.. పెరియార్ రామస్వామిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ”మొదట మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లటానికి బదులు తొందరపడి హైకోర్టుకు ఎందుకు వచ్చినట్టు?” అని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. తమిళనాడుకు చెందిన సంఘ సంస్కర్త పెరియార్ రామస్వామిపై రజనీకాంత్ అభ్యంతరకరమైన అరోపణలు చేశారని ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు మణి ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు. రజనీ క్షమాపణలు చెప్పాలంటూ ఆయన ఇంటి బయట కొందరు నలుపు రంగు దుస్తులు ధరించి నిరసనకు దిగారు. కాగా, తన వ్యాఖ్యానాలు ఆధారం లేనివి కావనీ, తాను ఈ విషయంలో క్షమాపణ చెప్పనని రజనీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.