బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే టైటిల్తో రామాయణగాథ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన రాముడి తండ్రైన దశరథుడి పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కోసం టైగర్ ష్రాఫ్, సీతగా కృతిసనన్ నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అజయ్ దేవ్గణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెన గతంలో రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్లు దర్శకత్వం వహించనున్నారు. మూడు భాగాలుగా ఈ రామాయణ గాథను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా ఇందులో రాముడిగా మహేష్ బాబు, రావణుడిగా హృతిక్ రోషన్ను ఫైనల్ చేసినట్టు సమాచారం. సీతగా దీపికా పదుకోన్ కనిపిస్తారట. ఈ సినిమా సుమారు 1500 వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. 2022లో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ 2024లో విడుదల కానుంది.