HomeTelugu Trendingతిరుపతి కోర్టుకు హాజరైన నటుడు మోహన్‌బాబు

తిరుపతి కోర్టుకు హాజరైన నటుడు మోహన్‌బాబు

Mohan Babu at Tirupati cour
సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. 2019లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మదనపల్లి హైవేపై మోహన్‌బాబు ఫ్యామిలీ ఆందోళన చేసిందని కేసు నమోదైంది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ లతో పాటు శ్రీవిద్యానికేతన్ ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్ లపై కూడా కేసు నమోదయింది.

కోర్టు నుంచి బయటకు వచ్చాక మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ వాస్తవానికి తనకు సమన్లు అందలేదని అయినా జడ్జి పిలిచారని వచ్చానని, ఆయన సమక్షంలోనే సమన్లపై సంతకం చేశానని చెప్పారు. సంతకం పెట్టాం, బయల్దేరుతున్నామని అన్నారు. తిరుపతి ఎన్టీఆర్ సెంటర్ నుంచి పాదయాత్రగా వచ్చారనే వార్తలపై స్పందిస్తూ పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు అన్నారు. కారులో వచ్చి అక్కడ దిగాం, మా కోసం వచ్చిన జనంతో కలిసి హ్యాపీగా నడుచుకుంటూ కోర్టులోకి వెళ్లామని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu