అక్కినేని సమంత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి అయిన తరువాత కూడా టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.అయితే ఈ సంవత్సరం వచ్చిన జాను సినిమాతో కొంచెం నిరాశపరిచింది సమంత. అయితే తన తరువాత సినిమా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… ఈ సినిమాలో సమంత భర్త నాగ చైతన్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. అయితే ఓ బేబీ సినిమాలో కూడా చైతన్య కనిపిస్తాడు కానీ చాల తక్కువ సమయం అయితే ఇప్పుడు ఈ సినిమాలో చైతన్య పాత్ర కొంచెం ఎక్కువ సమయమే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.