HomeTelugu Trendingరకుల్‌తో మరోసారి చైతూ రొమాన్స్

రకుల్‌తో మరోసారి చైతూ రొమాన్స్

Nagachaitanya romance with
అక్కినేని కుటుంబంతో కొత్త తరహాలో ‘మనం’ సినిమా రూపొందించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు విక్రం కుమార్. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తాడు. తెలుగులో అక్కినేని నాగచైతన్యతో విక్రం కుమార్ తన తదుపరి చిత్రం రూపొందిస్తున్నాడు. థ్యాంక్యూ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక కొంతవరకు పూర్తయిందట. ఇందులో చైతూ సరసన ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఓ హీరోయిన్‌గా రకుల్‌ను ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. మరో హీరోయిన్‌గా తమిళ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్‌ను సంప్రదించారట. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu