మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చేస్తున్న ట్వీట్లకు సరదాగా సమాధానాలిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా మోహన్ బాబుతో జరిగిన సంభాషణ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
మరోవైపు కరోనా వైరస్ పై ప్రజల్లో చైతన్యం కలిగించేలా మంచు లక్ష్మి చేసిన ఓ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. దీనిపై లక్ష్మి స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు తన తండ్రిని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, ‘వైరస్ గురించిన తన వీడియోను మెగాస్టార్ ఎండార్స్ చేయడం వల్ల అది ఎక్కువ మందికి చేరుతుంది. నాన్న… నా పక్కన మీ మిత్రుడు ఉన్నారు. మా బంధం నీరు, చేప వంటిది’ అని వ్యాఖ్యానించింది.
Megastar endorsing my video on virus awareness makes the reach wider and more effective. Naanna,, naa pakkana mee mitrudu unnaru.. our relation is now like fish and water…. @KChiruTweets https://t.co/GRovqKi9Jt
— Lakshmi Manchu (@LakshmiManchu) March 28, 2020