HomeTelugu Trending‘నాట్యం’ పాటను విడుదల చేసిన బాలయ్య

‘నాట్యం’ పాటను విడుదల చేసిన బాలయ్య

Natyam first song released
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌, నటి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా నమఃశివాయ’ అంటూ సాగే పాటను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘నాట్యం’ సినిమా నుంచి ఇలాంటి అద్భుతమైన పాటను విడుదల చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన ఈ పాటకు శ్రవణ్‌ భరధ్వాజ్‌ అద్భుతంగా సంగీతం అందించారు. ఈ పాటను ఆలపించిన లలిత, కాళభైరవతోపాటు తనలోని కొత్త ప్రతిభతో మనందర్నీ మెప్పించిన కమల్‌కామరాజు, కనులవిందుగా నాట్యం చేసిన సంధ్యారాజుకి నా అభినందనలు’ అని బాలయ్య పేర్కొన్నారు.

హీరో, హీరోయిన్‌ ఒక ఉత్సవంలో భాగంగా శివాలయంలో స్వామివారి సన్నిధిలో నాట్యం చేసే సందర్భంలో వచ్చే పాట ఇది. లేపాక్షి ఆలయంలో ఈ పాట షూటింగ్‌ జరిగింది. ఆకట్టుకునేలా ఉంది ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో, భానుప్రియ .. శుభలేఖ సుధాకర్ .. కమల్ కామరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu