HomeTelugu Trendingప్రభాస్, నాగచైతన్యకు కథలు చెప్పిన పరశురామ్..!

ప్రభాస్, నాగచైతన్యకు కథలు చెప్పిన పరశురామ్..!

5 20
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత ప్రస్తుతం జాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 30 శాతం పైగా షూటింగ్ పూర్తయింది. వచ్చేవారం తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. ఫ్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కాలం వచ్చేలోగా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అక్కినేని హీరో నాగచైతన్య మజిలీ తరువాత వెంకీమామ, శేఖర్ కమ్ముల సినిమాలతో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఇటు ప్రభాస్ కు, అటు నాగచైతన్యకు కథలు చెప్పారట. ఇద్దరు హీరోలు పరశురామ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ప్రభాస్ జాన్ సినిమాతో బిజీగా ఉండటంతో.. ముందుగా నాగచైతన్యతో సినిమా చేయడానికి పరశురామ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ములతో నాగచైతన్య సినిమా పూర్తికాగానే పరశురామ్ సినిమా ప్రారంభించే అవకాశం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu