టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన రికార్డు సాధించింది. సోషల్ మీడియాలో పూజా హెగ్డే యాక్టివ్ ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్లో లైవ్ చిట్చాట్ నిర్వహిస్తు నిత్యం ఫ్యాన్స్ను పలకరించే ఈ బుట్టబొమ్మ తాజాగా ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించుకుంది. దీంతో పూజా సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటోంది. తన హేర్ స్టైలిస్ట్, మేకప్ అర్టిస్ట్ కాజోల్, కుక్, అసిస్టెంట్, కుక్ అసిస్టెంట్స్లను కూడా తన సంతోషంలో భాగం చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది.
దీనికి ‘ఇన్స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా క్రేజీ టీంను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వీరంతా నన్ను నవ్విస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. నేను అనారోగ్యం బారిన పడకుంటా చూసుకుంటుంటారు. అలాగే నేను అందంగా కనిపించేలా చేస్తారు’ అంటూ రాసుకొచ్చింది. అంతేగాక తను ఈ మైలు రాయి చేరుకోవడంలో సహాయం చేసిన ఫ్యాన్స్, ఫాలోవర్స్కు పూజా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.
View this post on Instagram