టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. అల వైకుంఠపురములో సినిమా తరువాత స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్నవి దాదాపు పాన్ ఇండియా చిత్రాలే. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట. ప్రస్తుతం నితిన్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయనున్న ఓ సినిమాకు పూజా సైన్ చేసినట్లు సమాచారం.
ఈ మూవీకి గాను ఏకంగా రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. ఇందుకు నిర్మాతలు కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే దక్షిణాదిన భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల లిస్ట్లోకి పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం చిరంజీవి ఆచార్యలో, ప్రభాస్తో రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రాలతో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలోనూ నటిస్తుంది. ఇవి కాకుండా తమిళంలో విజయ్తో బీస్ట్, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో ‘కభీ ఈద్… కభీ దీవాలి’ చిత్రంలోనూ నటిస్తుంది.