కరోనా వైరస్ ఎఫెక్ట్తో లాక్ డౌన్ నడుస్తుంది. దానితో ఎప్పుడూ ఎవరి పనులల్లో వారు బిజీగా ఉండే వారంతా ఇప్పుడు కుటుంబంతో సన్నిహితులతో కాలం గడుపుతున్నారు. సాధారణ ప్రజలే కాకుండా షూటింగ్ లు నిలిచిపోవడంతో సెలెబ్రెటీలు కూడా ఫ్యామిలీతో గడుపుతూ మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరవుతున్నారు. కాగా అల వైకుంఠపురంతో హిట్ కొట్టిన పూజ హెగ్డే కూడా తన ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు పూజ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. షారుక్ గురించి ఒక విషయం చెప్పండి అని అభిమాని అడిగిన ప్రశ్నకు పూజ “కింగ్ ఆఫ్ రొమాన్స్” అంటూ సమాధానం ఇచ్చింది. ఇక నాని గురించి ఒక విషయం చెప్పండి.. అని మరో అభిమాని అడగటం తో ఇంటిలిజెంట్ యాక్టర్ అంటూ సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ.