యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని అశ్విన్ పేర్కోన్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటించనున్నట్లు చిత్రయూనిట్ ఈ రోజు ఓ వీడియో విడుదల చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఇక ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. అయితే తన సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోణె చేస్తుంది అనే విషయం పై తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. అందులో చిత్రబృందం విడుదల చేసిన వీడియో పోస్ట్ చేస్తూ… మా సినిమా బోర్డులో దీపికా పడుకోణె ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, మీకు స్వాగతం” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా దీపిక తన ట్విట్టర్ ద్వారా ఈ న్యూస్ ఎంతో థ్రిల్గా ఉంది. అద్బుత ప్రయాణం కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్లో తెలిపింది. అయితే ప్రభాస్ క్రేజ్ కు దీపికా వంటి స్టార్ కలవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడాయి.